Tuesday, July 26, 2011

అవాక్కయ్యాను.

మనం తెలుగులో చూసే సినిమాలు చాలా వరకు ఇంగ్లిష్ నుంచి కాపీ కొట్టినవే. హెచ్.బి.ఓ., స్టార్ మూవీస్, మూవీస్ నవ్ చానల్స్ ఇళ్ళలోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమాల సరుకేమిటో తెలిసి పోయింది.

ఇటీవల చూసిన కొన్ని సినిమాలను, వాటిలోని చాలా సీన్లను మహామహులనుకొనే దర్శకులు కాపీ కొట్టిన సంగతి చూసి అవాక్కయ్యాను. కొన్ని. మీకు కూడా దొరికితే చెప్పండి. బైలైన్తో చేరుస్తాం.

Mr She . మిస్టర్ పెళ్ళాం. 1993
Mrs Doubt fire 1993 భామనే సత్య భామనే.1996
Father of the bride 1991 ఆకాశమంత 2009
Our Hospitality 1923 మర్యాద రామన్న 2010

Sunday, June 12, 2011

journalists be careful

Mid day journalist JD killed just because of the series of stories he wrote about the weakening of Dawood Gang in India and Pakistan. He just wrote them by taking the information from police officials. D gang wanted to prove that they are still powerfull in Mumbai. There are thousands of Don seenus in Mumbai who want to catch the glimpse of Dawood Bhai. They might have killed JD on the instance of of shakeel. Andhra Journalists becareful.

Sunday, May 29, 2011

సింగపూర్ లోనూ ఐ సి యు లోనే రజని.

రజని కాంత్ ఆరోగ్యం వ్యవహారం ఏదో అనుమానాస్పదంగానే ఉంది. వరుసగా రెండు సార్లు తీవ్రంగా సిక్ అయ్యి ఐ సి యు లో చేరాడు. ఇప్పుడు సింగపూర్ ఆస్పత్రిలోనూ ఐ సి యు లో పెట్టారట. టీవీల్లో చూపించిన ఆయన మొహం తీవ్ర అనారోగ్యంతో భయంకరంగా ఉంది. అంతకు ముందు ఆయన చనిపోయారని ఇంటర్నెట్ కథనాలు కూడా వచ్చాయి. దేవుడు ఆయన అభిమానులకి సంతోషం కలిగించు గాక.

Rajani Kanth, singapore, internet, ICU, Sick,

ఆలోచించారా.

పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నాం. భూమి పొరల్లో ఉన్న ముడి చమురు ఎన్ని రోజులు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా. మహా అయితే మరో ఇరవై ఏళ్ళు. ఆ తర్వాత టాటా, లేలాండ్, హుండై వాహనాలన్నీ తుక్కు కిందే. అమెరికా వాడు తిరిగి వాడుకొనే వీలున్న ఇందనం.. ఉదాహరణకు హైడ్రోజన్, సూర్య రశ్మి... వీటికి సంబందించిన హై ఎండ్ టెక్నాలజీ రూపొందించాడు. మనని పెట్రోల్ డీజిల్ కార్ల వైపు ఎగదోలుతున్నాడు. ఏదో ఒక రోజు ముడి చమురు అయిపోతుంది. మనమంతా హై ఎండ్ టెక్ కోసం మళ్ళి అమెరికా వాడి కాళ్ళ కింద నుంచి దూరి పోవాల్సిందే. అప్పటిదాకా అమెరికాలో మన ఎన్ఆర్ ఐ పిల్లలు ఎక్కాల్లో, స్పెల్లింగుల్లో ఫస్ట్ వస్తే చూసి సంబర పడదాం.

America,crude oil, NRI, cars, Andhra Pradesh, diesel, petrol, tata, leyland, hundai,

Saturday, May 30, 2009

popular telugu websites

www.eenadu.net

www.andhrajyothy.com

www.sakshi.com

www.idlebrain.com

www.greatandhra.com

Sunday, August 26, 2007

జై మధ్యంతరం జై తెలంగాణా

తెలంగాణాకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానంలో కదలిక మొదలైంది. తెలంగాణా వాదులు ఈ విషయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అణు వివాదంలో యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని హెచ్చరికలు పంపడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో తన బలాన్ని పదిలం చేసుకోవాలనే స్పౄహలోకి వచ్చింది. అందులో భాగంగానే తెరాస ఎంపీలను తన ఒడిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈమేరకు పి.సి.సి. అధ్యక్షుడు కె.కేశవరావు ముగ్గురు తెరాస ఎం.పి.లతో బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెరాస ఎం.పి.లను కాంగ్రెస్ లో చేరాలని సూచించారు. సమావేశానికి తెరాస అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. నరేంద్ర ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెప్పేశారని సమాచారం. తెలంగాణా సాధించకుండా కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెప్పె ప్రసక్తి లేదని తెరాస ఎం.పి.లు స్పష్టం చేశారు. అందుకు కేకే ఒక రాజీ ఫార్ములా సూచించారు. దాని ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరో తీర్మానం చేస్తుంది. రెండో ఎస్.ఆర్.సి.కి బదులు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రీఆర్గనైగేషన్ కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.(ప్రభుత్వం వేసినప్పుడు సంగతి.) ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో ఈ సిఫార్సు చేసినట్లు చెబుతారు. లెఫ్ట్ హ్యాండిస్తే మధ్యంతర ఎన్నికల కోసం ఈ ఏర్పాటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ యూపీయేలో పెద్ద పార్టీగా పెత్తనం చేయడానికి ఆంధ్రాలో వచ్చిన మెజారిటీయే కారణం. ఈ నేపధ్యంలో అదే సంఖ్యలో సీట్లతో ప్రస్తుత మధ్యంతరం గట్టెక్కితే చాలు. తెలంగాణా ఇచ్చే సంగతి వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. సేం స్టోరీ. ఈ ప్రతిపాదన నచ్చితే తెరాసా కాంగ్రెస్ లో చేరొచ్చు. ఐడెంటిటీ ఉండాలనుకుంటే కాంగ్రెస్ తో పొత్తుతో సొంత కుంపటి కంటిన్యూ చేయవచ్చు. ఈ ఫార్ములాపై ప్రస్తుతం తెరాస మల్లగుల్లాలు పడుతోంది.

Saturday, August 18, 2007

సెంటిమెంట్ భయం!

శనివారం ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి జైరాంరమేశ్ మాటలు చూస్తుంటే కాంగ్రెస్ అధిష్టానానికి అభివృధ్ది కార్డు మీద గెలుస్తామన్న ఆశలు లేనట్లు కనిపిస్తోంది.ఎంత అభివృధ్ది చేసినా తెలంగాణ సెంటిమెంట్ పట్టించుకోక పోతే ఎదురు దెబ్బ తప్పదని భయపడుతోంది.కేంద్రం తెలంగాణా అంశంను పట్టించుకుంటుందని మంత్రి వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ దే కాదని స్పష్టం చేశాడు.