Tuesday, July 31, 2007

ఎలా ఉంది స్టోరీ?

ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి కష్టాలు మొదలు అయ్యాయి. ఆయన పదవికి రోజులు దగ్గర పడ్డాయి. సోనియాగాంధీ అన్నీ గమనిస్తున్నారు. లెఫ్ట్ వత్తిడి ఎక్కువైంది. ఇప్పుడే వై.ఎస్.కు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన తన ఎం.ఎల్.ఏ.లను కన్సాలిడేట్ చేసుకుంటాడేమోనన్న భయంతోనే బయట పడటం లేదు. నిజానికి ఇప్పటికే సీనియర్ కాంగ్రెస్ నేతలతో మాట్లాడటం పూర్తి అయ్యింది. మీకు చేతనైనంత మంది ఎం.ఎల్.ఏ.లను గ్రిప్ లో పెట్టుకోండి అని సీనియర్ నేతలకు చెప్పడం జరిగింది. సమయం వచ్చినపుడు వాళ్ళంతా వై.ఎస్.కు ఎదురు తిరుగుతారు. వై.ఎస్. ఓ 40 మంది ఎం.ఎల్.ఏ.లను చీల్చుకున్నా పెద్ద నష్టం లేదు. వామపక్షాలు సోనియా కాంగ్రెసుకు మద్దతు ఇస్తాయి. ఎలా ఉంది స్టోరీ? నిజం కూడా కావచ్చు.